ఇవి ఒక రోజు ఈనాడు లో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి రాసినపుడు చదివిన విషయాలు. రాజ కుమారి దక్కినా, దక్కకపోయినా సాహసాలు మాత్రం చేసి తీరాల్సిందే అనుకునే వారి కోసమే
అప్పటికే కార్తీక్ విజయవాడ నుండి వచ్చాడు ... తనను చూడగానే నాకు షాక్ ... ఎందుకంటె తను జస్ట్ పద్నాలుగు సంవత్సరాలు ... అంతే ... ఊటీ చూద్దామని బయటకు వెళ్ళాను ... బ్లాక్ కలర్ స్వెట్టర్ కనిపించింది ... నచ్చింది ... కొనేసాను ... చిన్నగా వర్షం పడుతోంది ... ఇంతలో కందస్వామి, సుభాష్, సెంథిల్, ... వచ్చారు. బి.డి.ఎస్ చదువుతున్నారు. పరిచయం చేసుకున్నాను. రెండున్నరకు మహేంద్ర జీప్ లో పార్సన్స్ వ్యాలీ కు తీసుకెళ్ళారు. పదిహేను కిలోమీటర్లు, జర్నీ బావుంది.
ప్రక్క ఫోటో పార్సన్స్ వ్యాలీ బస్ క్యాంపు ఫోటో
మా మజిలిలో కొన్ని తీపి గురుతులు :

మా మంచి గైడ్ - రమేష్
అందరూ ఇతనిని రమేష్ అన్నా, రమేష్ అన్నా అని పిలిచేవారు.
ముకుర్తి చేరుకున్నాం.
మా గురించి ఎదురు చూస్తూ సింగ్ గారు వెల్ కం చెప్పారు. రాగానే వేడి, వేడి టీ ఇచ్చారు. ఇక్కడ ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు తిరుగుతాయి, ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లొద్దు అని చెప్పారు. దగ్గరలో డాం ఉంది. కనీసం బాత్ రూం కు కూడా వాటర్ లేదు, డాం కు వెళ్ళాల్సిందే.
ఇక్కడ ఈ రోజు మేము ఉండబోయే కాటేజ్ బావుంది, చుట్టూ అడవి, జంతువులు ఏమి రాకుండా ఫెన్సింగ్. నాకు అయితే బలే బలే నచ్చేసింది. వెంటనే ఫొటోస్ తీయడం మొదలు పెట్టేసాను.
దయ్యం సినిమాలలో ఇల్లు ఇలానే ఉంటాయి. ముందు వరండా, మూడు గదులు. ఒకటి అమ్మాయిలకు, ఒకటి అబ్బాయిలకు, ఒకటి సింగ్ గారికి.
బాగ్ లోపల పెట్టి డాం చూడడానికి బయలుదేరాం, వాటర్ బాటిల్స్ పట్టుకుని. నది ప్రవహిస్తున్న చప్పుడు ఆ ప్రశాంత వాతావరణంలో చాలా బావుంది. ఇక్కడ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ల ఆఫీసు ఉంది. అక్కడి వాళ్లు చెప్పారు, రొజూ ఏనుగులు నీళ్లు తాగడానికి వస్తాయని, ఫెన్సింగ్ ను తొక్కి వెల్లిపోతాయని.
మూడు గంటలకు మెలకువ వచ్చేసింది. రెండు కారణాలు ఉనాయి. ఒకటి చలి అయితే, రెండవది ఏనుగుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒకవేళ ఏనుగులు గేటు ను విరగ్గొట్టి లోపలికి వస్తాయేమో అన్న ఆలోచనల వల్ల.
నా దగ్గర స్వాతి ఉంది. అప్పుడు చదవడం మొదలెట్టాను.
అప్పుడు తీసిన ఫోటో ఇది. మళ్ళా పడుకున్నాను.
ఉదయం ఆరు గంటలకు సింగ్ గారు విజిల్ వేసి అందరిని నిద్ర లేపెసారు.


